క్రైమ్/లీగల్

ట్రాక్టర్ బోల్తాపడి - ఇద్దరు కూలీల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు టౌన్, ఏప్రిల్ 10: చిట్టమూరు మండలంలోని మొలకలపూడి - చిల్లమూరు మార్గమధ్యంలో ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. శ్రీకాళహస్తి పరిసర ప్రాంతమైన గుమ్మిడిగుంట, అలత్తురు గ్రామాలకు చెందినవారు మంచినీటి బోర్లు వేసే స్టాటర్ రాళ్లను ఆయా గ్రామాలకు తీసుకొస్తుంటారు. ఈనేపథ్యంలో చిట్టమూరు మండలంలోని కొన్ని గ్రామాలకు సోమవారం అర్ధరాత్రి కాళహస్తి నుండి తీసుకొస్తున్న సమయంలో చిట్టమూరు రహదారిపై ట్రాక్టర్ బోల్తాపడింది. ఈసంఘటనలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ వాహనంలో మొత్తం నలుగురు కూలీలు, ఒక డ్రైవర్ ప్రయాణిస్తున్నట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందినవారిలో నాయుడుపేటకు చెందిన నాగముంతల శివయ్య (27), చిత్తూరు జిల్లా బుచ్చినాయుడుకండ్రిక మండలానికి చెందిన అలత్తురు గ్రామ నివాసి కంచి మణి (29) మృతి చెందారు. చనిపోయిన ఇద్దరు కూడా రోజువారీ కూలీలు. ప్రమాద స్థలాన్ని గూడూరు డిఎస్పీ రాంబాబు, వాకాడు సిఐ ఉప్పల సత్యనారాయణ, స్థానిక ఎస్సై వేణుగోపాల్ పరిశీలించారు. ఈ ప్రమాదానికి కారణం ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంగా నడపడమేనని పోలీసులు తెలిపారు. ఈమేరకు చిట్టమూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి శవపంచనామా అనంతరం బంధువులకు అప్పగించారు.