ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ నుంచి వైకాపా వాకౌట్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 9 March 2016
హైదరాబాద్: ప్రశ్నోత్తరాల సమయంలో సుదీర్ఘంగా ప్రసంగించరాదని స్పీకర్ పదేపదే చెప్పటంతో, అందుకు నిరసనగా ఎ.పి. అసెంబ్లీలో బుధవారం వైకాపా సభ్యులు వాకౌట్ చేశారు. సమావేశం ప్రారంభమైన వెంటనే విపక్ష నేత వై.ఎస్.జగన్ మాట్లాడుతూ రైతు రుణాలను ప్రభుత్వం చెల్లించనందున రాష్టవ్య్రాప్తంగా రైతులు అధిక మొత్తంలో అపరాధ వడ్డీ చెల్లిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ మాట్లాడుతుండగా ప్రశ్నోత్తరాల సమయంలో ఇలా సుదీర్ఘంగా మాట్లాడటం సంప్రదాయం కాదని స్పీకర్ గుర్తు చేశారు. మాట్లాడటానికి అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ జగన్ నేతృత్వంలో సభ్యులు అసెంబ్లీ నుంచి బయటికి వెళ్లిపోయారు.