ఓ జర్నలిస్టు కథ ‘యు టర్న్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగస్థలంలో రామలక్ష్మిగా సమంత, కుమార్‌బాబుగా ఆది పినిశెట్టి విశేషమైన రీతిలో అశేష ప్రేక్షకలోకాన్ని మైమరపించిన తర్వాత కలిసి నటిస్తున్న చిత్రం ‘యు టర్న్’. కన్నడలో ఘనవిజం సొంతం చేసుకున్న ఈ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రం సెకెండ్ షెడ్యూల్ మొదలైంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిత్తూరు నిర్మిస్తుండగా. కన్నడ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన పవన్‌కుమార్ తెలుగు వెర్షన్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీనివాస్ చిత్తూరి మాట్లాడుతూ- ఒక ఫ్లై ఓవర్‌మీద చనిపోతున్న మోటార్ సైకిల్ రైడర్ల కేస్‌ను చేదించే ఓ జర్నలిస్ట్ కథే ‘యు టర్న్’. సమంత ఈ చిత్రంలో జర్నలిస్టుగా నటిస్తోంది. ఆమె నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆది పినిశెట్టి ఈ చిత్రంలో పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ ముగిసింది. ఇప్పుడు రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లోని బూత్‌బంగ్లాలో వేసిన భారీ సెట్‌లో మొదలైంది. ఈ షెడ్యూల్‌లో సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నాం. ఒరిజినల్ వెర్షన్ కంటే అద్భుతంగా తెలుగు, తమిళ రీమేక్‌ను తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ నేటివిటీకి తగ్గట్టుగా చేసిన మార్పులు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ చిత్రానికి కెమెరా: నికేత్ బొమ్మి, నిర్మాత: శ్రీనివాస్ చిత్తూరి, కథ, దర్శకత్వం: పవన్‌కుమార్.