ఆంధ్రప్రదేశ్‌

బంగ్లాదేశ్ బోణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల:టి-20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ రౌండ్ తొలి పోటీలో బంగ్లాదేశ్ జట్టు విజయంతో బోణీ కొట్టింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో బుధవారం నేదర్లాండ్స్‌తో జరిగిన పోటీలో బంగ్లాదేశ్ జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్న బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 153 పరుగులు చేసింది. 154 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ చివరి వరకు గట్టిపోటీయే ఇచ్చింది. అయితే ఆఖరి ఓవర్లలో వెంటవెంటనే వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు విక్టెలు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో బంగ్లాదేశ్ 8 పరుగుల తేడాతో విజయం సాధించినట్లయింది. కాగా అనుభవం లేకపోయినా నెదర్లాండ్స్ బాగానే ఆడింది.