రాష్ట్రీయం
రెంటచింతలలో మండిన ఎండలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 20 May 2018
రెంటచింతల, మే 19: గుంటూరు జిల్లా రెంటచింతలలో శనివారం 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో గ్రామస్థులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఉదయం నుండే ఎండలకు తోడు వెచ్చటి గాలులు వీస్తుండడంతో జనం బయటకు వచ్చే పరిస్థితి కనపడడం లేదు. ఉదయం ఎనిమిది గంటలకే తీవ్ర ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు చెప్పడంతో జనం బెంబేలెత్తుతున్నారు.