క్రైమ్/లీగల్
మహిళ మెడలో గొలుసు తెంచుకొని దొంగ పరార్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 23 May 2018
కంకిపాడు, మే 22: ఇంటి ముందు ఆరుబయట విశ్రాంతి తీసుకుంటున్న మహిళ మెడలో గొలుసు తెంచుకొని పరారైన ఘటన మండలంలోని గొడవర్రులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని శివాలయం సమీపంలో నివసించే పైకం సునీత సోమవారం రాత్రి 8గంటల సమయంలో ఇంటి ఆవరణలో మంచం వేసుకొని నడుంవాల్చి విశ్రాంతి తీసుకుంటుండగా వెనుక నుంచి వచ్చిన దొంగ ఆమె మెడలోని 5కాసుల బంగారు నాంతాడును తెంచుకుని పరారయ్యాడు. ఆ సమయంలో ఇంటిలో భర్త లేకపోవటం, కుమారుడు టీవీ చూస్తుండటంతో ఆమె అరుపులు ఎవరికీ వినిపించలేదు. భర్త వచ్చిన తరువాత విషయం చెప్పి కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.