క్రైమ్/లీగల్
ట్రాక్టర్ బోల్తా పడి ఒకరి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 23 May 2018
కాల్వశ్రీరాంపూర్, మే 22: మండలంలోని కూనారం గ్రామంలో మిషన్ కాకతీయ పనులలో భాగంగా మంగళవారం మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తాపడడంతో ఒకరు మృతి చెందారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..కూనారం గ్రామానికి చెందిన పానుగంటి సదానందం (35) అనే ట్రాక్టర్ డ్రైవర్ చెరువు కట్టపై నుండి మొరం తీసుకొని వెళ్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి కట్టకిందికి బోల్తాపడింది. దీంతో డ్రైవర్ సదానందం అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య తిరుమలతో పాటు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కాల్వశ్రీరాంపూర్ ఎస్ఐ షేక్ జానీపాషా తెలిపారు.