క్రైమ్/లీగల్
ఆగివున్న లారీని ఢీకొన్న వ్యాను
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కట్టంగూర్, మే 26: హైదరాబాద్ - విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై మండలపరిధిలోని అయిటిపాముల గ్రామశివారులోని ఎన్టీ ఆర్నగర్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోదాడ నుండి కోళ్లలోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం ఎన్టీ ఆర్నగర్ వద్ద రోడ్డుపై నిర్లక్షంగా ఆపిన లారీని వెనుక నుండి వేగంగా ఢీకొట్టడంతో డీసీఎం వాహనంలో ఉన్న హైదరాబాద్లోని అంబర్పేట్ దుర్గానగర్కు చెందిన కోళ్లవ్యాన్పై పనిచేసే కూలీ బాంకూరు వెంకటేశ్ (27) అక్కడికక్కడే మృతిచెందగా వ్యానులో ఉన్న సూపర్వైజర్ కడారి శివయాదవ్ (23), డీసీఎం డ్రైవర్ శోభన్బాబులకు తీవ్రగాయాలు కాగా వీరిని చికిత్స నిమిత్తం నార్కెట్పల్లి సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించి పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహామేరకు హైదరాబాద్లోని కామినేని ఆసుపత్రికి తరలించగా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెంకు చెందిన సూపర్వైజర్ శివయాదవ్ మృతి చెందాడు. డ్రైవర్ శోభన్బాబు పరిస్థితి విషమంగా ఉంది మృతుడు వెంకటేశ్ భార్య హైమావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు కట్టంగూర్ ఎస్సై బి.రంజిత్ తెలిపారు.