రాష్ట్రీయం
జిల్లాలకు ఇంధన పొదుపు కమిటీలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 14 March 2016
హైదరాబాద్, మార్చి 13: విద్యుత్ పొదుపు చర్యల్లో భాగంగా జిల్లా స్థాయిలో కూడా ఇంధన పొదుపు కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్జైన్ తెలిపారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ పొదుపు కోసం సామాన్య ప్రజల్లో అవగాహన పెద్ద ఎత్తున తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. ఇందుకు రూ.10కే 1.87 కోట్ల ఎల్ఇడి బల్బులను సరఫరా చేసినట్లు ఆయన వెల్లడించారు. తద్వారా విద్యుత్ పొదుపు ఆశించిన దానికంటే ఎక్కువగా జరిగిందని, దీనిలో భాగంగా ఇంధన పొదుపు మరింత చేసేందుకు జిల్లా స్ధాయిలో ఇంధన పొదుపు కమిటీలు ఆయా జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.