ఆంధ్రప్రదేశ్‌

తాత్కాలిక ఉద్యోగులకు 2015 పేస్కేల్‌కు సిఫారసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 11: రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేసే తాత్కాలిక ఉద్యోగుల జీతాల పెంపు అంశంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. సచివాలయం 2వ బ్లాక్‌లోని ఆర్థిక మంత్రి పేషీలోని సమావేశ మందిరంలో సోమవారం ఉదయం మంత్రుల బృందం దీనిపై చర్చించారు.
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2016 అక్టోబర్ 16న వచ్చిన సుప్రీం కోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకుని వారికి సానుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను మంత్రి మండలికి సిఫార్స్ చేస్తారు. 1993 నవంబర్ 25కి ముందు విధుల్లో చేరిన వారికి 2015 ఆర్‌పీఎస్‌లో పేర్కొన్న ప్రకారం కనీస వేతనాన్ని పెంచే విషయంపై చర్చించారు. ఇప్పటికే 2010 పీఆర్‌ఎస్ ప్రకారం కనీస వేతనం, డీఏ పొందేవారికి 2015 సవరించిన పేస్కేల్ వర్తించే అంశంపైనా మంత్రుల బృందం చర్చించింది. ఆ మేరకు వారి వేతనాలు పెంచాలని మంత్రి మండలికి సిఫార్స్ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ నిర్ణయాలను మంత్రి మండలి ఆమోదిస్తే 5వేల మంది ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు. ప్రభుత్వంపై ఏడాదికి అదనంగా రూ. 21 కోట్లు భారం పడుతుందని అంచనా వేశారు. సమావేశంలో సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ పి దుర్గాప్రసాదరావు, ఆర్థిక శాఖ కార్యదర్శి హేమా మునివెంకటప్ప, డీఎంఈ బాబ్జీ, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో చర్చిస్తున్న మంత్రులు యనమల, కాలవ