క్రైమ్/లీగల్
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 1 July 2018
కొడవలూరు, జూలై 1: మండలంలోని రాచర్లపాడు వద్ద కారు, కంటైనర్ ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మృతిచెందగా మరొకరు తీవ్రగాయాలతో అపోలో వైద్యశాలలో చికిత్స పొంతున్నారు. గుంటూరులో జరిగే గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యేందుకు చెన్నైలోని చిదంబరం నుంచి ఓ కుటుంబం కారులో బయలుదేరింది. వీరు ప్రయాణిస్తున్న కారు కొడవలూరు మండలంలోని రాచర్లపాడు వద్ద ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొంది. ఈ సంఘటనలో కారులో ప్రయాణం చేస్తున్న సింధూజ (22), నాగభూషణ శాస్ర్తీ (70) అక్కడికక్కడే మృతిచెందగా, సతీష్, పద్మావతి అనే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరిని నెల్లూరులోని అపోలో వైద్యశాలకు తరలించగా, పద్మావతి చికిత్స పొందుతూ మరణించింది. కొడవలూరు ఎస్సై అంజరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.