క్రైమ్/లీగల్

కట్టుకున్న భర్తనే కడతేర్చిన భార్య..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెనే్నకొత్తపల్లి , జూలై 7 : భార్య తన భర్తను కడతేర్చిన సంఘటన గురువారం రాత్రి జరిగిన విషయం విదితమే. అయితే మంగలి నగేష్ హత్య కేసుకు సంబంధించిన వివరాలను శనివారం రామగిరి సీఐ యుగంధర్, ఎస్‌ఐ మహమ్మద్ఫ్రీలు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. చెనే్నకొత్తపల్లికి చెందిన నగేష్‌కు 14 సంవత్సరాల క్రితం బెంగళూరుకు చెందిన వరలక్ష్మితో వివాహం అయినది. వీరికి బాలాజీ, ముఖేష్‌లు సంతానం కలరు. కాగా నగేష్ నారుూ బ్రాహ్మణ వృత్తి చేస్తూ వుండేవాడు. ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా మద్యానికి బానిసై బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండేవాడు. అయితే భార్య వరలక్ష్మి కుటుంబ పోషణార్థం ఇంటిలోనే టైలరింగ్ పనిచేస్తూ జీవనం సాగించేది. ఈ నేపథ్యంలో భర్త నగేష్ భార్యకు అశ్లీల చిత్రాలు చూపిస్తూ అందులో వుండేలా తనను ఉండమంటూ తీవ్ర ఇబ్బందులు పెట్టేవాడు. అలా లేకుంటే తనను ఇష్టానుసారంగా కొట్టేవాడు. మూడు నెలల క్రితం జరిగిన ఈ గొడవల గురించి చుట్టుపక్కల వారు సర్దిచెప్పి గొడవ సద్దుమణిగింది. ప్రస్తుతం కొంతకాలంగా నగేష్ మద్యం మానుకున్నాడు. ఘటనకు ముందు రోజు రాత్రి 11 గంటల సమయంలో అశ్లీల చిత్రాలు చూపించి అదేవిధంగా చేయాలంటూ భర్యావై వొత్తిడి తెచ్చాడు. కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధం పెట్టుకున్నావంటూ వేధింపులకు గు రిచేసేవాడు. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో భర్త నగేష్ గాఢ నిద్రలో ఉండగా భార్య వరలక్ష్మి భర్తపై ఒక్కసారిగా ఇంటిలోనే వున్న మచ్చు కొడవలితో హత్య చేసింది. మెడకు దారంతో బిగించి, అరవకుండా తలదిండును అడ్డుపెట్టి హత్య చేసిందని సీఐ తెలిపారు. శనివారం నిందితురాలు వరలక్ష్మి బెంగళూరుకు వెళుతోందంటూ తమకు సమాచారం వచ్చిందన్నారు. చెనే్నకొత్తపల్లికి సమీపాన రహదారి పక్కన వుండగా ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నిజాలు నిగ్గు తేలాయన్నారు. నిందితురాలును ధర్మవరం కోర్టుకు హాజరుపరచినట్లు సీఐ పేర్కొన్నారు.