ఆంధ్రప్రదేశ్
సీఎంకు లారీ యజమానుల కృతజ్ఞతలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 11 September 2018
విజయవాడ, సెప్టెంబర్ 10: రాష్ట్రంలో పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏపీ లారీ యజమానుల సంఘం కృతజ్ఞతలు తెలిపారు. ఉండవల్లిలోని గ్రీవెన్సు హాల్లో సీఎంను సోమవారం కలిసి దేశంలోనే మొట్టమొదటగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి, లారీ ఫీల్డ్ను ఆదుకుంటున్న సీఎంగా నిలిచిపోతాయని తెలిపారు. సీఎంను కలిసిన వారిలో ఎంపీ కేశినేని నాని, లారీ యజమానుల సంఘం జనరల్ సెక్రటరీ ఈశ్వరరావు తదితరులు ఉన్నారు.