రాష్ట్రీయం
గండికోటకు నీరు విడుదల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 23 September 2018
అవుకు: కర్నూలు జిల్లా అవుకు జలాశయం నుంచి గండికోటకు శనివారం నీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ముఖ్యమంత్రి అవుకు మండలం రామాపురం హెడ్రెగ్యులేటర్ వద్ద స్విచ్ నొక్కి జీఎన్ఎస్ఎస్ గేట్లు ఎత్తారు. రోజుకు ఒక టీఎంసీ చొప్పున మొత్తం పది టీఎంసీల నీరు గండికోటకు విడుదల చేస్తారు. అదేవిధంగా గోరుకల్లు జలాశయం, పులికనుమ ఎత్తిపోతలను ప్రారంభించారు. ఇస్కాల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు కాలవ శ్రీనివాసులు, భూమా అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..అవుకు జలాశయం నుంచి గండికోటకు నీటిని విడుదల చేస్తున చంద్రబాబు