క్రైమ్/లీగల్
చెట్టును డికోట్టిన డీసీఎం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మూసాపేట, అక్టోబర్ 8: మండల కేంద్రంలోని పొలిస్ష్టషన్ సమిపంలోని సొమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. మూసాపేట ఎస్సై మధుసూదన్గౌడ్ తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ నుండి అనంతపూర్కు ట్రాక్టర్ ఇంజన్ బాడితో వెళ్తున్న ఎపి24వై5657 నంబర్ గల డీసీఎం అదుపుతప్పి చెట్టును ఢీకోట్టడంతో ఇద్దరు మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయని తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తుతో ఒక్కసారిగా మండల కేంద్రంలోని అదర్శ రెస్టారేంట్ ముందు ఉన్న వేపచెట్టును ఢీకొట్టడంతో డీసీఎం లోపల ఉన్న క్లీనర్ లింగరాజు క్యాబిన్లో ఇరుక్కొని అక్కడిక్కడే మృతి చెందాడు. డీసీఎం లోపల వెనుక భాగంలో ఉన్న కుంచన ఈదయ్య అనే వ్యక్తికి ట్రాక్టర్ బాడి బలంగా ఢీకొట్టడంతో తీవ్రగాయాల పాలైయ్యాడు. అసుపత్రికి తరలించగా చికిత్స పోందుతూ మృతి చెందాడని తెలిపారు. డీసీఎం డ్రైవర్ ఉపేందర్తో పాటు యాదగిరి, రంగయ్యగౌడ్, చంద్రయ్య, రవిందర్, బాలరాజుకు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. వీరంతా నల్గొండ జిల్లా కట్టంగుల మండలం కురుముర్తి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. కూలీ పనుల నిమిత్తం వీరంతా అనంతపూర్ వెళ్తుండగా ఈప్రమాదం జరిగిందని తెలిపారు.