ఆంధ్రప్రదేశ్‌

వక్ఫ్ ఆస్తుల రక్షణకు ప్రత్యేక కమిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, మార్చి 27: వక్ఫ్‌బోర్డు ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఐటి, సమాచార, ముస్లిం మైనార్టీ శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం బడ్జెట్‌లో 716 కోట్ల 54 లక్షల 80 వేల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. వేల కోట్ల రూపాయల వక్ఫ్‌బోర్డు ఆస్తులను గత ప్రభుత్వాలు అక్రమంగా అమ్మితే టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత అన్యాక్రాంతమైన వక్ఫ్‌బోర్డు ఆస్తులను కాపాడేందుకు జిల్లాకలెక్టర్ చైర్మన్‌గా, ఎస్పీ సభ్యునిగా ప్రత్యేక కమిషన్ వేసి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఆక్రమించుకున్నవారు ఎంతటివారైనా సహించేది లేదన్నారు.