క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంకిపాడు : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యిక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని ఉప్పలూరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం గ్రామానికి చెందిన వేము కొండయ్య(55) స్థానికంగా వ్వవసాయ కూలీ పనులు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో కొండయ్య ఉప్పలూరు రైల్వేగేటు వైపు నుంచి సైకిల్‌పై ఇంటికి వెళుతుండగా ఆర్‌సీం చర్చి సమీపంలో గన్నవరం నుంచి కంకిపాడు వస్తున్న లారీ వెనుక భాగం కొండయ్యను ఢీకొంది . ఈ ప్రమాదంలో కొండయ్య రోడ్డు పడిపోవటంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాద విషయం తెలసుకున్న స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీని పక్కకు తీసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరో ప్రమాదంలో నలుగురు మహిళలకు గాయాలు
అలాగే కోలవెన్ను, కుందేరు గ్రామాల మధ్య శుక్రవారం జరిగిన రహదారి ప్రమాదంలో నలుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉంగుటూరు మండలం ఇందులంపాడు గ్రామానికి చెందిన కొందరు మహిళలు కోలవెన్ను ఐరన్ ఫ్యాక్టరీలో పని చేస్తారు. శుక్రవారం సాయంత్రం విధులు ముగించుకుని ఆటోలో ఇంటికి వెళుతున్నారు. కోలవెన్ను, కుందేరుకు వేళ్లే రహదారిలో కుందేరు నుంచి వస్తున్న ట్రాక్టర్‌ని తప్పించబోయిన ఆటో అదుపు తప్పి బోదు కాల్వలో పడిపోయింది. ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలు గాయపడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.