క్రైమ్/లీగల్

కొడుకును చంపిన కసాయి తండ్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిన్నారం(గుమ్మడిదల),డిసెంబర్ 5: కన్న కొడుకుకి అనారోగ్యం వుండే వైద్యం చేయించి కాపాడుకోవాల్సిన తండ్రి కుమారుడి పట్ల కాలయముడిగా మారాడు. ఈ హృదయ విధారక సంఘటన గుమ్మడిదల మండలంలోని మంబాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గుమ్మడిదల ఎస్‌ఐ రాజేశ్‌నాయక్ వివరాల ప్రకారం మేడ్చల్ జిల్లా తుర్కపల్లికి చెందిన సునీతను మంబాపూర్ గ్రామానికి చెందిన కర్రె క్రిష్ణకు ఇచ్చి వివాహం చేయగా వారికి మూడు సంవత్సరాల కుమారుడు శ్రవణ్‌కుమార్ ఉన్నాడు. కాగా శ్రవణ్‌కు పుట్టుకతో నరాల బలహీనత వుంది. దీంతో పలు ఆసుపత్రులకు సైతం చూపించారు. కాగా రెండు నెలల క్రితం క్రిష్ణ భార్య సునీత అనారోగ్యంతో మృతి చెందింది. ఇక అప్పటి నుండి క్రిష్ణ మద్యానికి బానిసై కుమారుడి ఆలనాపాలనా మరిచాడు. అంతే కాకుండా కుమారున్ని అమ్మాలని చూశాడు. కుదరకు పోవడంతో గత మంగళవారం అర్ధ్ర రాత్రి గొంతు నులిమి హత్య చేశాడు. విషయాన్ని మృతుడి మేనమామ మంద మల్లేశ్ తెలపడంతో మృతదేహాన్ని చూసి అనుమానం వ్యక్తం చేసి గుమ్మడిదల పోలీసులకు ఫిర్యాదు చెశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.