ఆంధ్రప్రదేశ్‌

జగన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 25: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో అత్యున్నత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 69 సంవత్సరాలైందని తెలిపారు. ప్రతి పౌరుడికి ప్రజాస్వామ్యబ్ధంగా రాజ్యాంగం ప్రసాదించిన హక్కులే ప్రజాస్వామ్య సౌధాన్ని కాపాడుతున్నాయని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లుపొడిచే శక్తుల నుంచి ర్యాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అందరం కలిసి పని చేయడం నేటి అవసరమని వ్యాఖ్యానించారు.
సచివాలయ ఉద్యోగుల ఓటర్ల ప్రతిజ్ఞ

విజయవాడ, జనవరి 25: జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు ఓటర్ల ప్రతిజ్ఞ చేశారు. సచివాలయం ఆవరణలో శుక్రవారం జీఏడీ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ సచివాలయ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో న్యాయశాఖ కార్యదర్శి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయ నిధికి రూ 14.5 లక్షల విరాళం
ముఖ్యమంత్రి సహాయ నిధికి నాబార్డ్ ఉద్యోగులు రూ 14.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. శుక్రవారం ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును నాబార్డ్ సీజీఎం కె సురేష్‌కుమార్ తదితరులు కలుసుకుని విరాళపు చెక్కును అందజేశారు. ఉద్యోగుల ఒకరోజు వేతనం విరాళంగా అందించినట్లు చెప్పారు.