ఆంధ్రప్రదేశ్‌

కొణతాల రైలుయాత్రకు విజయవాడలో ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 27: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉత్తరాంధ్ర అభివృద్ధికి సత్వరం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలనే డిమాండ్‌తో మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ చేపట్టిన చలో ఢిల్లీ జనఘోష రైలుయాత్రకు ఆదివారం మధ్యాహ్నం విజయవాడ రైల్వేస్టేషన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ ఘన స్వాగతం పలికారు. విశాఖపట్నం నుండి కొత్త ఢిల్లీ వరకు చేపట్టిన ఈ రైలుయాత్ర విజయవాడకు చేరుకున్న సందర్భంగా కొణతాల విలేఖరులతో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర విభజన సందర్భంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన హామీలు అమలు చేస్తామని, రైల్వేజోను ఇస్తామని, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు.