క్రైమ్/లీగల్

వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, ఫిబ్రవరి 20: మండలంలో చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో ముగ్గురు గిరిజనులు మృత్యువాత పడినట్టు స్థానిక ఎస్.ఐ. అరుణ్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మండలంలోని లోతేరు పంచాయతీ ధనసానివలస గ్రామంలో కల్తీకల్లు తాగిన ఐదుగురిలో ఇద్దరు గిరిజనులు మంగళవారం మృతి చెందినట్టు చెప్పారు. ఓకే కుటుంభానికి చెందిన వారంతా కలిసి జీలుగు కల్లు సేవించడంతో అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలో పడిపోయినట్టు ఆయన తెలిపారు. కొంతసేపటి తరువాత వీరిని గ్రామస్తులు ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో కిల్లో గోపాల్ (22), అప్పన్న (25) మృతి చెందినట్టు ఆయన తెలిపారు. మిగిలిన ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని ఆయన చెప్పారు. ఇదిలాఉండగా సుంకరమెట్ట పంచాయతీ బంగళవలస గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కేంద్రం సహాయకురాలు కొర్రా చిన్నమ్మి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందినట్టు ఆయన తెలిపారు. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలు ఇంతవరకు తెలియరాలేదని ఆయన అన్నారు. ఈ రెండు సంఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాలను శవ పరీక్ష నిర్వహించినట్టు ఆయన చెప్పారు.