ఆంధ్రప్రదేశ్‌

కడప పెద్దదర్గాలో జగన్ ప్రార్థనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మే 16: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గురువారం రాత్రి కడప నగరంలోని ప్రముఖ అమీన్‌పీర్ దర్గా (పెద్ద దర్గా) దర్శించారు. దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేని జగన్‌కు స్వాగతం పలికారు. అనంతరం దర్గాలో ఛాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ సందర్భంగా దర్గాలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో జగన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాషా, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి పలువురు వైసీపీ నేతలు, ముస్లింలు పాల్గొన్నారు. పులివెందుల నుంచి నేరుగా అమీన్‌పీర్ దర్గాకు చేరుకున్న జగన్ అక్కడ ప్రార్థనల అనంతరం పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుకుని ప్రజలు, కార్యకర్తల నుండి వినతులు స్వీకరించారు.
చిత్రం... కడప పెద్దదర్గాలో ప్రధాన మజార్ వద్ద పూలఛదర్ సమర్పించి ప్రార్థనలు చేస్తున్న జగన్‌