రాష్ట్రీయం
శాసన మండలిలో తొలిసారిగా జగన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 18 June 2019
విజయవాడ: రాష్ట్ర శాసన మండలిలో తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం అడుగుపెట్టారు. మండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే అంశంపై చర్చ జరుగుతుండగా, మధ్యాహ్నం 11.24 గంటలకు వచ్చారు. ఆయన సభలోకి రాగానే సభ్యులంతా గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. మండలి చైర్మన్ షరీఫ్, టీడీపీ ఫ్లోర్ లీడర్ యనమల రామకృష్ణుడు సహా సభ్యులందరికీ అభివాదం చేశారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్తో కరచాలనం చేశారు. మధ్యాహ్నం 11.38 గంటల వరకూ ఉండి, ఆయన వెళ్లిపోయారు.