క్రైమ్/లీగల్
లారీ కింద పడి విద్యార్థి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 21 June 2019
షాద్నగర్ టౌన్, జూన్ 20: లారీ కిందపడి బీటెక్ విద్యార్థి మృతిచెందిన సంఘటన షాద్నగర్ పట్టణంలోని పరిగిరోడ్డులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షాద్నగర్ పట్టణంలోని ప్యారడైజ్ కాలనీలో నివాసముంటున్న సిమ్రాన్(20) అనే విద్యార్థిని, పరిగిరోడ్డు నుంచి సీఎస్కే వెంచర్కు బైకుపై వెళ్తుండగా అటుగా వచ్చిన లారీ ఢీకొనడంతో కిందపడిపోయింది. లారీ విద్యార్థిని శరీరంపై నుంచి వెళ్లడంతో అక్కడిక్కడే మృతిచెందింది. బైకుపై ఉన్న మరొక వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు షాద్నగర్ పోలీసులు తెలిపారు.