ఆంధ్రప్రదేశ్‌

అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వినతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 21: రాష్ట్రంలో ఎన్నికల పక్రియ సజావుగా జరిగి కొత్త ప్రభుత్వ పాలన కూడా ఆరంభమైనందున ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో బదిలీ అయిన తహశీల్దార్‌లను తిరిగి వారి జిల్లాలకు పంపించాలని అమరావతి జేఏసీ చైర్మన్, రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. గత కొన్ని దశాబ్దాలుగా పాటిస్తూ వస్తున్న విధానం ప్రకారం తహశీల్దార్‌లకు బదిలీ ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. అలాగే ఎన్నికల నిర్వహణ కొరకు తహశీల్దార్‌లు పెట్టిన ఖర్చులు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఎన్నికల నిర్వహణ కోసం 13 జిల్లాల కలెక్టర్‌లు కోరిన అదనపు నిధులు రూ.328 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు.