రాష్ట్రీయం
కాళేశ్వరానికి జాతీయ హోదాను విస్మరించిన కేంద్రం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పరకాల, జూలై 6: కాళేశ్వరం ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఇచ్చి ప్రాజెక్ట్కు రూ. 26వేల కోట్ల నిధులు ఇవ్వాలని విజ్ఞప్తిని కేంద్రం విస్మరించిందని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. శనివారం పరకాల పట్టణంలోని మాదారం కాలనీలోని తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో బయ్యరం ఉక్కు ఫ్యాక్టరి, కాజీపేట కోచ్ ఫ్యాక్టరి, కాకతీయ టెక్స్టైల్స్ పార్కు గురించి ఊసే లేదని, తెలంగాణకు ఒక కొత్త ప్రాజెక్ట్ కూడా ఇవ్వలేదన్నారు. బీజేపీ నుండి గెలిచిన ఎంపీలు ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రిపై ఒత్తిడి తీసుక వచ్చి నిధులు తీసుక వస్తారని అనుకున్నామని చెప్పారు. రాహుల్గాంధీ పదవి చేపట్టబోను అనడంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్ నాయకత్వంలో తెరాస పార్టీలో చేరి ప్రజలకు సేవలు చేస్తున్నారని చెప్పారు.
చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి