క్రైమ్/లీగల్

కుటుంబ కలహాలతో ఘాతుకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీపనగండ్ల, జనవరి 2: కుటుంబ కలహాల వల్ల ఒక వ్యక్తి భార్య, కూతురుకు నిప్పు పెట్టి తాను కూడా ఆత్మహత్యా యత్నం చేశాడు. ఈ సంఘటనలో కూతురు అక్కడికక్కడే, అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయ. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన బడికల జయన్న బుధవారం రాత్రి 10 గంటలకు భార్య వరలక్ష్మి, కూతురు గాయత్రి ఇంట్లో నిద్రిస్తుండగా వారిపై పెట్రోల్ పోసి, తనపై పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
జయన్న (40), కూతురు గాయత్రి (17) తీవ్ర గాయాలతో మృతి చెందగా, భార్య వరలక్ష్మి (35) పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామస్థులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం భార్యభర్తలు ఇద్దరూ ఎప్పుడు గొడవ పడుతుండేవారని తెలిపారు. జయన్న వ్యవసాయం చేసేవాడని, వరలక్ష్మి అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నట్టు తెలిపారు. కుమారుడు హైదరాబాద్‌లో ప్రయివేట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, కేసు దర్యాప్తు చేపడుతున్నామని ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
'చిత్రం...మంటల్లో మృతిచెందిన కూతురు (దుప్పటిలో చుట్టిన మృతదేహం) క్షతగాత్రులైన దంపతులు