ఆంధ్రప్రదేశ్‌

28 నుండి విధులకు హాజరుకానున్న న్యాయవాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (లీగల్), జనవరి 25: రాష్ట్ర హైకోర్టు తరలింపు ప్రకటన నేపథ్యంలో గత రెండు నెలలుగా నిరవధికంగా విధులకు గైర్హాజరవుతున్న న్యాయవాదులు ఈ నెల 28వ తేదీ నుండి తిరిగి విధులకు హాజరయ్యేందుకు సమాయత్తమయ్యారు. ముందుగా ప్రకటించిన మేరకు విధుల బహిష్కరణ ఫిబ్రవరి 3వ తేదీ వరకు కొనసాగాల్సి ఉంది. అయితే మారిన పరిణామాల నేపథ్యంలో శనివారం ఐదు జిల్లాల జాయింట్ యాక్షన్ కమిటీ నెల్లూరు బార్ అసోసియేషన్ హాలులో అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఇప్పటికే న్యాయవాదులు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటుండటం, ప్రస్తుతం తరలింపు అంశం తాత్కాలికంగా కోర్టు మెట్లపై ఉన్నందున విధుల గైర్హాజరు ఆపాలని నిర్ణయించింది. నెల్లూరుతో పాటు ప్రకాశం, గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో 28 నుండి విధులకు హాజరు కావాలని ఏకగీవ్రంగా తీర్మానించారు.