రాష్ట్రీయం
దిగువ అహోబిలంలో వేడుకగా రథోత్సవం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 10 March 2020
ఆళ్లగడ్డ: ప్రముఖ వైష్ణవ క్షేత్రం దిగువ అహోబిలంలో సోమవారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం వేడుకగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన ఉత్సవమూర్తులు శ్రీ ప్రహ్లాదవరదుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు పూజల అనంతరం ఆలయం నుంచి ఊరేగింపుగా రథం వద్దకు తోడ్కొనివచ్చారు. రథంలో స్వామివార్లను ఆశీనులనుజేయించిన అనంతరం హారతి ఇచ్చి రథోత్సవాన్ని ప్రారంభించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు మజ్జిగ, ప్రసాదం అందజేశారు.
*చిత్రం...దిగువ అహాబిలంలో రథోత్సవం నిర్వహిస్తున్న దృశ్యం