ఆంధ్రప్రదేశ్
ఎపి ప్రజలను వంచించిన బిజెపి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 5 May 2016
విజయవాడ: గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ఎపి ప్రజలను బిజెపి నేతలు దారుణంగా వంచించారని కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ విమర్శించారు. ఆయన గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, ఎపికి ఐదేళ్లు కాదు, పదేళ్లు ప్రత్యేకహోదా ఇవ్వాలని రాష్ట్ర విభజన సమయంలో గొప్పలు చెప్పిన వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ ఇపుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేకహోదాను సాధించేందుకు సిఎం చంద్రబాబు అఖిలపక్ష బృందాన్ని దిల్లీకి తీసుకువెళ్లి ప్రధానితో పాటు కేంద్రమంత్రులను నిలదీయాలని నెహ్రూ అన్నారు.