రాష్ట్రీయం

నకిలీ రైల్వే టికెట్ల ముఠా గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 5: నకిలీ రైల్వే రిజర్వేషన్ టికెట్ల ముఠా గుట్టు రట్టయింది. గత కొంత కాలంగా హైదరాబాద్‌లోని బుకింగ్ కౌంటర్ల వద్ద బ్రోకర్లు నకిలీ రైల్వే టికెట్లు విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రైల్వే సికిందరాబాద్ డివిజన్ యాంటీ టౌటింగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. గత నెల 28న మెహిదీపట్నంలోని ఓ రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ వద్ద పి రవి, పి శ్రీకాంత్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 16,165 విలువ చేసే జర్నీ/రిజర్వేషన్ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని ఆర్‌పిఎఫ్ పోలీసులు విచారించగా లక్డికాపూల్‌లోని లావెర్న్ ట్రావెల్స్‌కు సంబంధించిన ఏజెన్సీ ద్వారా నకిలీ రిజర్వేషన్ టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయని తేలింది. దీంతో పోలీసులు లావెర్న్ ట్రావెల్స్‌పై దాడి చేశారు. రూ. 93,665 విలువ చేసే 44 జర్నీ/రిజర్వేషన్ టికెట్లు స్వాధీనం చేసుకొని ట్రావెల్స్ నిర్వాహకుడు టి రాజేశ్ సింగ్‌ను అరెస్టు చేసినట్టు రైల్వే పోలీసులు తెలిపారు.