ఆంధ్రప్రదేశ్‌

వైకాపాను వీడనున్న పలమనేరు ఎమ్మెల్యే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వైకాపా అధినేత జగన్‌కు మరో షాక్ తగలనుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ప్రస్తుతం వినిపిస్తోంది. కొంతకాలంగా పార్టీ అధ్యక్షుడు జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డి టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. అసెంబ్లీలో పిఎసి అధ్యక్ష పదవి దక్కనందున ఆయన కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా విజయవాడలో జరిగిన వైకాపా విస్తృతస్థాయి సమావేశానికి కూడా అమర్‌నాథ్‌రెడ్డి హాజరు కాలేదు. నేడో, రేపో టిడిపి అధినేత చంద్రబాబును కలిసి ఆ పార్టీలో చేరేందుకు ఆయన తన అనుచరులతో ఇప్పటికే మంతనాలు జరిపినట్లు సమాచారం.