మూడో షెడ్యూల్‌లో వైశాఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరీశ్, అవంతిక జంటగా ఆర్.జె.సినిమాస్ పతాకంపై జయ.బి. దర్శకత్వంలో బి.ఎ.రాజు రూపొందిస్తున్న భారీ చిత్రం ‘వైశాఖం’. ఈ చిత్రానికి సంబంధించిన కజకిస్తాన్ షెడ్యూల్ పూర్తిచేసి సినిమాను 60 శాతం ముగించారు. ఈ సందర్భంగా నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ, యూత్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రం ఈ సంవత్సరంలో సూపర్‌హిట్‌గా నిలుస్తుందన్న నమ్మకం వుందని, అన్ని పాటలు అందరికీ నచ్చేలా వచ్చాయన్నారు. కథకు పూర్తి న్యాయం జరిగేలా ఎక్కడా రాజీపడకుండా హైబడ్జెట్‌తో ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నామని, మంచి చిత్రాలను ఆదరించే ప్రేక్షకులకు ‘వైశాఖం’ తప్పక నచ్చుతుందని ఆయన అన్నారు. ఈ నెల 20 నుండి మూడో షెడ్యూల్ ప్రారంభిస్తున్నామని, కథలో కీలకమైన కొన్ని ముఖ్య సన్నివేశాలను రాత్రి చిత్రీకరణలో చేయనున్నామని దర్శకురాలు జయ.బి. అన్నారు. ఓ కొత్త కథాంశంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను రూపొందించడం ఓ ఛాలెంజ్‌గా తాను భావిస్తున్నానని, అన్ని పాత్రలకూ ఈ కథలో ప్రాధాన్యత వుంటుందని ఆమె అన్నారు. సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఈశ్వరీరావు, రమాప్రభ, పృధ్వీ, కాశీ విశ్వనాధ్, కృష్ణ్భగవాన్, శ్రీలక్ష్మి, గుండు సుదర్శన్, భద్రం, సొంపు, ఫణి, మాధవి, జెమిని, జబర్దస్త్ వెంకి, శ్రీ్ధర్, రాంప్రసాద్, తేజ, లతీష్, శృతినాయుడు, చాందినీ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా:వాలిశెట్టి వెంకట సుబ్బారావు, సంగీతం:డి.జె.వసంత్, నిర్మాత:బి.ఎ.రాజు, దర్శకత్వం:జయ.బి.