రాష్ట్రీయం

విపక్షాలది దుష్ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: అమరావతిలోని సదావర్తి భూముల కొనుగోలు వ్యవహారంలో తమ పార్టీ నేతల తప్పేమీలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో సదావర్తి భూముల కొనుగోలుపై వస్తున్న ఆరోపణలు చర్చకు వచ్చినట్లు సమాచారం. సదావర్తి భూములు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు వారసులకు చెందినవని, తమిళనాడులో చాలా భూములు ఎప్పుడో అన్యాక్రాంతమయ్యాయని సమావేశంలో బాబు అన్నట్టు తెలిసింది. అసలు ఇప్పుడు అక్కడ అంతకుమించి కొనేవారు కూడా లేరని, కావాలంటే ఎక్కువరేటు ఇచ్చి కొనుక్కోమని మనం కూడా చెప్పవచ్చన్నారు. ఈ వ్యవహారంలో వైసీపీ, కాంగ్రెస్ అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నాయే తప్ప, వారి ఆరోపణల్లో నిజం లేదన్నారు. అందులో మన పార్టీ నేతల తప్పేమీలేదని, కొనుకున్న వారే తమకు ఇంత ఇచ్చి మీరే తీసుకోమని చెబుతుంటే, ఆరోపణలు చేస్తున్నవారెవరూ స్పందించకపోవడం బట్టి, వారి ఆరోపణల్లో పస లేదని అర్ధమవుతోందని బాబు వివరించారు.
కాగా, అమరావతిలో స్విస్ చాలెంజ్ విధానంపై నిర్మించననున్న భవనాల తీరుపై, బాబు మంత్రివర్గ సహచరులకు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. స్విస్‌చాలెంజ్ విధానంపై వైసీపీ చేస్తున్న విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు.