రాష్ట్రీయం
నేడే ఎంసెట్ తుది ర్యాంకులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కాకినాడ, జూలై 5: ఇంటర్మీడియెట్ బోర్డులో సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సంబంధించి ఎంసెట్-2016 తుది ర్యాంకులను బుధవారం జెఎన్టియుకె వెల్లడించనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇంటర్మీడియెట్ సహా ఇతర బోర్డులు నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సంబంధించి ఈ ఫైనల్ ర్యాంకులను వెల్లడించనున్నట్టు ఎంసెట్-2016 కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు చెప్పారు. సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సంబంధించిన మార్కులు ఆయా సంస్థల నుండి తెప్పించుకున్నట్టు ఆయన చెప్పారు. మార్కుల్లో ఉన్న మార్పులను పరిగణనలోకి తీసుకుని తుది ఫలితాలను వెల్లడించనున్నట్టు తెలిపారు. ఇంటర్మీడియట్ సహా అన్ని రకాల బోర్డులకు చెందిన విద్యార్థులకు ఈ అవకాశం కల్పించామని, ర్యాంకులను సంక్షిప్త సందేశం ద్వారా విద్యార్థుల మొబైల్స్కు పంపనున్నట్టు తెలిపారు. ర్యాంకు కార్డులను ఈనెల 7వ తేదీ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.