ఆంధ్రప్రదేశ్‌

యువకులపై దాడికేసులో నిందితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: రేపల్లెలో జాస్మిన్ అనే యువతిపై అత్యాచారం చేసి, హత్య చేశారన్న ఆరోపణలపై ఇద్దరు యువకులను చితకబాదిన నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. గ్రామస్థుల దాడిలో గాయపడిన సాయి అనే యువకుడు మరణించాడు. జాస్మిన్ ఉరివేసుకుని మరణించడాన్ని చూసిన సాయి, పవన్ అనే యువకులు గట్టిగా కేకలు వేశారు. ఈ ఇద్దరే జాస్మాన్‌ను చంపారని అనుమానించిన గ్రామస్థులు వారిని నడివీధిలో చితకబాదారు. గాయపడిన సాయి ప్రాణాలు కోల్పోగా, పవన్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. యువకులపై దాడి చేసినందుకు జాస్మిన్ అన్న షాదుల్లాతో పాటు మరికొంతమంది గ్రామస్థులను అరెస్టు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. జాస్మిన్, సాయి మృతదేహాలకు పోస్టు మార్టం జరిపిన రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.