రాష్ట్రీయం
రాష్టప్రతితో చంద్రబాబు భేటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, డిసెంబర్ 21: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని సోమవారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసారు. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 12వ తేదీ వరకు విశాఖపట్నంలో జరగనున్న సిఐఐ సమ్మిట్కు రావాల్సిందిగా ఆహ్వానించారు. అంతేకాకుండా ఈ నెల 29న అనంతపురంలో ప్రైమరీ సెక్టార్ మిషన్ను సందర్శించాల్సిందిగా ఆయన కోరినట్లు సమాచారం. శీతాకాల విడది కోసం హైదరాబాద్కు వచ్చిన రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని సోమవారం సాయంత్రం బొల్లారంలోని రాష్టప్రతి నిలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి కొంత సేపు చర్చించారు. కరవు పరిస్థితులను ఎదుర్కొవడానికి తమ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ప్రైమరీ సెక్టార్ మిషన్లో భాగంగా ఫాంపాడ్స్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన విషయాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా రాష్టప్రతికి వివరించినట్లు సమాచారం. ఇటువంటివి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పారు. అనంతపురంలో ప్రారంభించిన ఈ పైలట్ ప్రాజెక్టును సందర్శించాల్సిందిగా ఆయన కోరారు. రాష్ట్ర విభజన తర్వాత విశాఖపట్నంలో తొలిసారి నిర్వహించబోయే సిఐఐ సమ్మిట్కు హాజరుకావాల్సిందిగా చంద్రబాబు రాష్టప్రతిని కోరారు.