కడప

అమ్మవారుశాలలో జగన్ ప్రత్యేక పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల, అక్టోబర్ 6: దసరా ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పట్టణంలోని అమ్మవారుశాలకు చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు అర్చకులు జగమోహన్‌రెడ్డికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ అధ్యక్షుడు కొత్త రవికుమార్, పబ్బతి రాము, పట్ట్భా తదితర ఆర్యవైశ్యులు జగన్‌కు సన్మానం చేసి అమ్మవారి జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆయన ఆర్యవైశ్యసంఘం మహిళలు ఏర్పాటుచేసిన బొమ్మల కొలువును తిలకించారు. ఆలయంలో నిర్వహించిన హోమంలో జగన్ పాల్గొని ప్రత్యేక పూజు చేశారు. అక్కడికి వచ్చిన విద్యార్థులు, చిన్నారులతో ఆప్యాయంగా పలుకరించి సెల్ఫీలు దిగారు. కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్‌రెడ్డి, జిల్లా ఎంపి వై ఎస్.అవినాష్‌రెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్మెన్ వైఎస్.మనోహర్‌రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ చిన్నప్ప, జగన్ వ్యక్తిగత కార్యదర్శి రవిశంకర్, వైకాపా జిల్లా ప్రధానకార్యదర్శి ఓతూరు రసూల్, సర్వోత్తమరెడ్డి, ఆర్యవైశ్యసంఘం సభ్యులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.