S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రం నిధుల దారిమళ్లింపు

విజయవాడ: గత 20రోజుల క్రితం స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను దారిమళ్లించి ప్రస్తుతం పారిశుద్ధ్య పనులు, కనీసం బ్లీచింగ్ కూడా చల్లలేని దుస్థితికి తీసుకురావద్దని కోరుతూ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కేంద్రం పంచాయతీలకు రూ.870 కోట్లు, మున్సిపాల్టీలకు రూ.441 కోట్లు విడుదల చేస్తూ ఈ మొత్తం నిధులను కరోనా నివారణ పనులకు వాడాలని ఆదేశించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగిస్తోందని పేర్కొన్నారు.

నెల్లూరు జిల్లాలో 55కు చేరిన కరోనా బాధితులు

నెల్లూరు, ఏప్రిల్ 13: నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ గల బాధితుల సంఖ్య సోమవారం సాయంత్రానికి 55కు చేరింది. సోమవారం తాజాగా నాలుగు కేసులు వెలుగుచూడటంతో జిల్లాలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌కు గురైన బాధితుల సంఖ్య 55కు చేరినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజ్యలక్ష్మి వెల్లడించారు. సోమవారం 32 మంది నమూనాలను సేకరించి పరీక్షకు పంపగా, వారిలో నలుగురు పాజిటివ్‌గా తేలారు. జిల్లాలో ఇప్పటి వరకు 721 మంది నమూనాలను పరీక్షలకు పంపించడం జరిగిందని వారిలో 619 మందికి కరోనా నెగిటివ్ రిపోర్టు వచ్చిందని ఆమె తెలిపారు. మరో 47 మందికి సంబంధించి ఫలితాలు రావాల్సి ఉందన్నారు.

పలు సంస్థల విరాళాలు

విజయవాడ, ఏప్రిల్ 13: కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి పలు సంస్థలు సోమవారం విరాళాలను అందజేశాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయా సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలిసి విరాళాల చెక్కులు అందజేశారు. హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 5కోట్ల రూపాయలు, కోటి రూపాయలతో పీపీఈ కిట్స్, మందులు, మాస్క్‌లు అందజేసింది.

హిందూపురంలో బయో కెమికల్ టనె్నల్

హిందూపురం టౌన్, ఏప్రిల్ 13: కరోనా కట్టడి కోసం రాష్ట్రంలోనే తొలిసారిగా అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని మూడు ప్రాంతాల్లో సోమవారం బయోటనె్నల్స్‌ను ప్రారంభించారు. పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన టనె్నల్‌ను సబ్ కలెక్టర్ నిశాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కర్నాటక రాష్ట్రం ప్రాజెక్టు సుగర్దన తరపున డాక్టర్ కార్తీక్ నారాయణ్ సహకారంతో బయో క్రిమి సంహారక టనె్నల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

విశాఖ నుంచి జపాన్ వాసుల పయనం

విశాఖపట్నం, ఏప్రిల్ 13: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా విశాఖలో చిక్కుకున్న జపాన్ దేశానికి చెందిన పలువురు సోమవారం నగరం నుంచి బయలుదేరారు. లాక్‌డౌన్‌కు ముందు విశాఖ చేరుకున్న ఆరుగురు జపాన్ దేశస్తులు కరోనా కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు కావడంతో విశాఖలో చిక్కుకుపోయారు. గత 20 రోజులుగా వీరంతా నగరంలోని ఒక హోటల్‌కే పరిమితమయ్యారు. కేంద్రం విధించిన లాక్‌డౌన్‌కు ముందు దేశంలోని వివిధ పట్టణాల్లో పలువురు జపాన్ దేశీయులు చిక్కుకుపోయారు. జపాన్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు ప్రభుత్వం వీరిని తిరిగి వారి స్వస్థలాలకు పంపేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

ప్రజల ప్రాణాల్ని కాపాడిన ఎస్‌ఈసీ తొలగింపు అన్యాయం

గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడిన రమేష్‌కుమార్‌ను ఎస్‌ఈసీ పదవి నుండి తొలగించడం అన్యాయమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు.

ప్రకాశం జిల్లాలో 41 కోవిడ్ పాజిటివ్ కేసులు

ఒంగోలు, ఏప్రిల్ 13: ప్రకాశం జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 41 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో ఎక్కువగా జిల్లాకేంద్రమైన ఒంగోలులోనే 25 కేసులు నమోదు కావటంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధానంగా ముస్లింలు ఎక్కువగా నివసించే ఇస్లాంపేటలోనే కోవిడ్ కేసులు నమోదుకావడంతో ఆ ప్రాంతంలో జిల్లాయంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. జిల్లాలోని చీరాలలో 5, కందుకూరులో 3, చీమకుర్తిలో 1, కనిగిరిలో 1, మార్కాపురంలో 1, కారంచేడులో 4, కొనకనమిట్లలో ఒక కోవిడ్ కేసు నమోదైంది. కాగా సోమవారం ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, 29మందికి కోవిడ్ నెగెటివ్ వచ్చినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు.

గూడ్స్ వాహనాలకు గ్రీన్‌సిగ్నల్

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఇప్పటివరకు అత్యవసర సరుకులను రవాణా చేసే వాహనాలకు మాత్రమే అనుమతి ఉండేంది. ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని వణికిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ ఈ నెల 14తో ముగియనున్న నేపథ్యంలో మానవాళి జీవన మనుగడ పట్ల ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలతో జరిపిన చర్చల నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగించేందుకే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

రాజ్‌భవన్ నిర్ణయం రాజ్యాంగబద్ధమే!

విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. రాజ్యాంగం పరిధికి లోబడే మొత్తం ప్రక్రియ కొనసాగిందని పలువురు న్యాయకోవిదులు అంటున్నారు. ప్రస్తుత ఎస్‌ఈసీ నియామకం కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(కే), ఏపీ పంచాయతీరాజ్ చట్టం, 1994లోని 200 సెక్షన్ ప్రకారమే జరిగిందంటున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలంలో మార్పులు చేసే సంపూర్ణ అధికారం గవర్నర్, లేదా ప్రభుత్వానికి ఆయా సెక్షన్‌ల ప్రకారం భారత రాజ్యాంగం కల్పించింది. 2007లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అక్కడి ఎన్నికల కమిషనర్ పదవీకాలంపై తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది.

నిజమైన మానవత్వం

మానవత్వం గురించి చాలామంది చాలా చెబుతుంటారు. అసలు మానవత్వం ఉండాలి అని ప్రత్యేకంగా చెప్పడంలోని అంతరార్థం ఏముంటుంది? మనుషులన్నాక మానవత్వం ఉండి తీరాలి కదా. మానవత్వం లేకుండా ఇంత పని చేశారు అనే మాటలు మనం వింటుంటాం. కనికరం, మానవత్వం, ఇలాంటి మాటలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే ఈ ప్రపంచంలోకి మనుషులు వివిధ రకాల జంతువులు వచ్చాక చివరగా మనిషి రంగప్రవేశం చేశాడనేది కొంతమంది చెబుతుంటారు. ఇది నిజం అనుకొంటే- పశువులకు మనిషికి తేడా కొట్టవచ్చినట్టు కనబడుతుంది. పశువు తిండి, నిద్ర, మైధునం ఇట్లాంటి నిత్యకృత్యాలు ప్రకృతిని అనుసరించి చేస్తూ ఉంటాయి.

- ప్రసన్న

Pages