-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 2: కామనె్వల్త్ గేమ్స్ సమీపిస్తున్న కొద్దీ పోటీదారుల్లో విపరీతమైన ఒత్తిడి పెరుగుతున్నది. 71 కామనె్వల్త్ దేశాల నుంచి ఇప్పటికే ఇక్కడికి చేరుకున్న చాలా మంది శిక్షణలో మునిగితేలుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విజేతలుగా నిలవాలన్న పట్టుదలతో సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్గా కొత్తగా ఎంపికైన భారత స్టార్ క్రికెటర్ అజింక్య రహానేపై ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం ఎంతో నమ్మకం పెట్టుకుంది.
బ్యాటింగ్కే ప్రాధాన్యమిచ్చే ఐపీఎల్లో భారీ స్కోర్ల టాప్-5 జట్లలో కేవలం రెండు జట్లు మాత్రమే ఉన్నాయి. 2013లో పుణే వారియర్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐదు వికెట్లకు 263 పరుగులు చేసింది. 2016లో అదే జట్టు గుజరాత్ లయన్స్పై మూడు వికెట్లకు 248 పరుగులు సాధించింది.
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్లో ఈనెల 4 నుంచి జరిగే కామనె్వల్త్ గేమ్స్లో భారత్ అత్యధిక పతకాలతో స్వదేశానికి తిరిగి వస్తుందని షటిల్ బాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్స్ సిల్వర్ మెడల్ విజేత పీవీ సింధు ఆశాభావం వ్యక్తం చేసింది.
కార్డ్ఫి, ఏప్రిల్ 1: ఇద్దరు మేటి బాక్సర్ల మధ్య హోరాహోరీగా సాగిన ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ చాంపియన్షిప్లో జోసెఫ్ పార్కర్పై ఆంథోనీ జాషువా విజయం సాధించాడు. నాకౌట్లతో ప్రత్యర్థులను చిత్తుచేస్తాడన్న పేరున్న జాషువాకు పార్కర్ను ఓడించడానికి 12 రౌండ్లు పోరాడాల్సి వచ్చింది. చివరికి ఈ ఫైట్ను అతను పాయింట్ల ఆధారంగా తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్లో రాణించడం ద్వారా జాతీయ జట్టులో స్థానం సంపాదించాలని కొందరు, ఇప్పటికే జాతీయ జట్టులో ఉన్నప్పటికీ తమతమ స్థానాలను పదిలం చేసుకోవాలని మరికొందరు అన్ని శక్తులను ధారపోసి ఆడతారు. ఫ్రాంచైజీలు తమ కాంట్రాక్టును పొడిగించాలని, మళ్లీ వేలానికి వెళ్లకూడదని అనుకోని వారు ఉండరు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: లెంజడరీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ అందరికీ ఆదర్శప్రాయమైన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్ నుంచి రిటైరైనా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. రాజ్యసభ సభ్యుడిగా తనకు లభించిన జీతభత్యాలు మొత్తం ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చాడు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఆరు సంవత్సరాల్లో నెలవారి జీతం, అలవెన్సుల రూపంలో రూ.90 లక్షలు పొందాడు.
క్రైస్ట్చర్చ్, ఏప్రిల్ 1: న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ 29 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించి మూడవ రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లకు 202 పరుగులు చేసింది.
జొహానె్నస్బర్గ్, ఏప్రిల్ 1: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి, నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా ఎదురీదుతోంది. ప్రత్యర్థి సాధించిన 488 పరుగుల భారీ స్కోరుకు సమాధానంగా మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టి, రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 110 పరుగులు చేసిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆటను మరో 111 పరుగులు సాధించి ఆలౌటైంది. కెప్టెన్ టిమ్ పైన్ 62, పాట్ కమిన్స్ 50 పరుగులతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.
సిడ్నీ, ఏప్రిల్ 1: తన భార్య కాండిస్ను దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫఫ్ డు ప్లెసిస్తోపాటు ఆ దేశ క్రికెట్ బోర్డు అధికారులు కొందరు హేళన చేసినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికే డేవిడ్ వార్నర్ బాల్ ట్యాంపరింగ్కు పాల్పడ్డాడా? వారికి బుద్ధి చెప్పడానికి ఆ మార్గాన్ని ఎంచుకున్నాడా? 3సిడ్సీస్ సండే2 పత్రికకు ఇచ్చిన కాండిస్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఈ అనుమానాలకు తావిస్తున్నది.