-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
చిత్రం.. మహిళల వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంగ్లాండ్, భారత్ జట్ల కెప్టెన్లు హీతర్ నైట్, మిథాలీ రాజ్
లండన్, జూలై 22: ‘క్రికెట్ మక్కా’గా పిలిచే లార్డ్స్ మైదానంలో, మహిళల ప్రపంచ కప్ చాంపియన్షిప్ టైటిల్ను గెల్చుకోవడమే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగుతున్నది. ఆదివారం ఇంగ్లాండ్తో జరిగే ఈ తుది పోరాటంలో మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత్ గెలిస్తే, సరికొత్త చరిత్రను సృష్టిస్తుంది. 2005లో జరిగిన వరల్డ్ కప్లో భారత మహిళలు తొలిసారి ఫైనల్ చేరారు.
న్యూఢిల్లీ, జూలై 22: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) చైర్మన్, బిసిసిఐ సీనియర్ అధికారి రాజీవ్ శుక్లా చేసిన ఒక ట్వీట్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లండన్లో జరుగుతున్న మహిళల ప్రపంచ కప్ చాంపియన్షిప్ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరిన భారత్ను అందరూ ప్రశంసల్లో ముంచెత్తారు. తాను కూడా అభినందనలు తెలపాలన్న అత్యుత్సాహంతో శుక్లా గొప్పగా ట్వీట్ చేశాడు.
లండన్: ప్రపంచ కప్ చాంపియన్షిప్ ఫైనల్లో ఇంగ్లాండ్ను ఢీకొనేందుకు శనివారం ముమ్మరంగా ప్రాక్టీస్ చేసిన భారత మహిళల క్రికెట్ జట్టుకు ‘స్పెషల్ బౌలర్’గా అర్జున్ తెండూల్కర్ నెట్స్లో బౌలింగ్ చేశాడు. భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ కుమారుడు అర్జున్ లండన్లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు. అయితే, సచిన్ మాదిరి అతను బ్యాటింగ్లో కాకుండా బౌలింగ్పై ఆసక్తి చూపుతూ, ఆ విభాగంలోనే ఎదుగుతున్నాడు.
మొనాకో డైమండ్ లీగ్ పురుషుల 100 మీటర్ల స్ప్రింట్ను 9.95 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకం సాధించిన తర్వాత చీర్ లీడర్లతో కలిసి తనదైన శైలిలో విక్టరీ ఫోజులిస్తున్న ప్రపంచ నంబర్ వన్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్. ఇటీవల కాలంలో అతను స్ప్రింట్ను పది సెకన్లలోపు పూర్తి చేయలేకపోతున్నాడు.
సిడ్నీ, జూలై 22: ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ పీటర్ దూహన్ మృతి చెందాడు. 1987 వింబుల్డన్లో బోరిస్ బెకర్ను ఓడించి సంచలనం సృష్టించిన 56 ఏళ్ల దూహన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని టెన్నిస్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో తెలిపింది. ‘బెకర్ రెకర్’ (బెకర్ను చిత్తుచేసిన వాడు) అని పేరు తెచ్చుకున్న దూహన్ తన కెరీర్లో అత్యుత్తమంగా 43వ ర్యాంక్ వరకూ చేరాడు. ఐదు టైటిళ్లు గెల్చుకున్నాడు.
కొలంబో, జూలై 22: శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్తో జరిగిన రెండు రోజుల వామప్ మ్యాచ్ని భారత్ డ్రా చేసుకుంది. మొదటి రోజు ఆటలో లంక బోర్డు జట్టు 55.5 ఓవర్లలో 187 పరుగులకే ఆలౌట్కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్లో మూడు వికెట్లకు 135 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఓవర్ నైట్ స్కోరుతో చివరి రోజైన రెండో రోజు ఆటను కొనసాగించింది. 68 ఓవర్లలో 9 వికెట్లకు 312 పరుగులు చేసింది.
ఆనాహెమ్ (అమెరికా), జూలై 22: కామనె్వల్త్ గేమ్స్ చాంపియన్ పారుపల్లి కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్ ఇక్కడ జరుగుతున్న యుఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్లో సెమీస్ చేరారు. తన సహచరుడు సమీర్ వర్మతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో కశ్యప్ 21-13, 21-16 తేడాతో విజయం సాధించాడు. ఈ మ్యాచ్ కేవలం 40 నిమిషాల్లో ముగిసింది.
చిత్రం.. చెన్నైలో శనివారం జరిగిన తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టిఎన్పిఎల్) క్రికెట్ టోర్నమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న చెన్నై సూపర్ కింగ్స్ యజమాని, బిసిసిఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్,
మహేంద్ర సింగ్ ధోనీ, మోహిత్ శర్మ, మాథ్యూ హేడెన్
జొహానె్నస్బర్గ్, జూలై 22: మహిళల హాకీ వరల్డ్ లీగ్ సెమీ ఫైనల్స్ టోర్నీలో భారత్కు ఎనిమిదో స్థానం దక్కింది. ఏడు, ఎనిమిది స్థానాలకు జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్ను ఢీకొన్న భారత్ 1-2 తేడాతో ఓడింది. మ్యాచ్ ఆరంభంలో ఆధిపత్యాన్ని కనబరచిన భారత్కు గుర్జీత్ కౌర్ గోల్ను అందించింది. అయితే, ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది.