S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/26/2016 - 08:13

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 25: శుక్రవారం జరిగిన విజయవాడ నగరపాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా సాగింది. నిత్యం విపక్షాల ఆందోళనలు, రగడలతో రసాభాసగా జరిగే విఎంసి కౌన్సిల్ ఆందోళనకు తావులేకుండా సజావుగా సాగిన తీరు గమనార్హం. మేయర్ కోనేరు శ్రీ్ధర్ అధ్యక్షతన జరిగిన ప్రస్తుత కౌన్సిల్‌లో మొత్తం 104 అంశాలు చర్చకు రాగా 16ప్రశ్నల్లో మొదటి 5ప్రశ్నలపై చర్చ సాగింది.

11/26/2016 - 08:02

నందిగామ, నవంబర్ 25: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పధకాలు అందించాలన్నదే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుందని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధ్యక్షతన శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయిలో డ్వాక్రా మహిళలకు రెండవ విడత పెట్టుబడి నిధి రూ.14కోట్లను పంపిణీ చేశారు.

11/26/2016 - 07:58

శంషాబాద్, నవంబర్ 25: ఫ్రధాని నరేంద్రమోదీకి శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. నరేంద్రమోదీ వచ్చిన భారత వాయుసేన విమానం శుక్రవారం సాయంత్రం 6.28 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగింది. ముఖ్యమంత్రి కేసిఆర్, గవర్నర్ నరసింహన్ తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.

11/26/2016 - 07:58

కాచిగూడ, నవంబర్ 25: తెలంగాణ రాష్ట్రంలోని 11 బిసి కులాల ఫెడరేషన్లలోని సొసైటీలను పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖమంత్రి జోగు రామన్న హామీ ఇచ్చారని తెలంగాణ రజక సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరి సత్యనారాయణ చెప్పారు. శుక్రవారం తెలంగాణ సచివాలయంలో బిసి కులాల ఫెడరేషన్ల రాష్ట్ర నాయకుల బృందం మంత్రి జోగురామన్నను కలిసి వినతి పత్రాని అందజేశారు.

11/26/2016 - 07:57

హైదరాబాద్, నవంబర్ 25: రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాలలో ఈనాటికి కనీస సౌకర్యాలు, విద్యుత్ దీపాలు లేక అక్కడి ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆయా ప్రాంతాలు పర్యటించి అక్కడి ప్రజల సాధకబాధలు తెలుసుకొని చేతనైన సహకారం అందించాలనే సంకల్పంతో హైదరాబాద్ యూత్ అసెంబ్లీ, గోల్-4 స్వచ్ఛంద సేవా సంస్థ ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూరు మండలంలోని లండిగూడ గ్రామాన్ని చేరి సేవలు అందించారు.

11/26/2016 - 07:56

హైదరాబాద్, నవంబర్ 25: జంటనగరాల్లోని సుమారు కోటి మంది జనాభాకు అత్యవసర, అతి ముఖ్యమైన సేవలందించే జిహెచ్‌ఎంసిలో స్తబ్దత నెలకొంది. ముఖ్యంగా జిహెచ్‌ఎంసిని గత కొంతకాలంగా నిధులు, సిబ్బంది కొరత పట్టి పీడిస్తుండటంతో ఇప్పటికే ప్రతిపాదించిన, కొత్తగా రూపకల్పన చేసిన అభివృద్ధి పనుల ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కేవలం నిరంతరంగా అందించే పౌరసేవలు, స్వచ్ఛ భారత్ పనులు మినహా పెద్దగా ప్రాజెక్టు పనులు కొనసాగటం లేదు.

11/26/2016 - 07:55

హైదరాబాద్, నవంబర్ 25: నగరంలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ సంస్థ పరిధిలోని 83 శాఖ గ్రంధాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పూర్తి వివరాలను తనకు అందజేయాలని, సిబ్బందిపై సర్వే నిర్వహించాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్, సిటీ సెంట్రల్ లైబ్రరీ పర్సన్ ఇన్‌ఛార్జి ఎం. ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం ఆమె కలెక్టరేట్‌లో నగర గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు.

11/26/2016 - 07:55

హైదరాబాద్, నవంబర్ 25: భాగ్యనగరమంటేనే పర్యాటక పరంగా ప్రపంచ వ్యాప్తంగా ఓ మంచి గుర్తింపు ఉందని, ఇక హుస్సేన్‌సాగర్ వచ్చిన వారు సెల్ఫీలు దిగకుండా ఉండలేరని, మున్ముందు నగరాన్ని మరింత అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ వ్యవహరాలు, ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు.

11/26/2016 - 07:53

విజయవాడ, నవంబర్ 25: అర్చకులు, దేవాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం మరింత దృష్టి సారించింది.

11/26/2016 - 07:42

భటిండా, నవంబర్ 25: సట్లెజ్, బియాస్, రవి నదుల జలాలపై భారత్‌కే హక్కు ఉందని, అందువల్ల ఈ జలాలను వృథాగా పాకిస్తాన్‌లోకి పోనివ్వకుండా నిలిపివేస్తామని, ఇక్కడి రైతులే ఉపయోగించుకునేలా చూస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ‘సింధూ జలాల ఒప్పందం- సట్లెజ్, బియాస్, రవి- ఈ నదులలోని జలాలు భారత్‌కు, మన రైతులకే చెందుతాయి. ఈ నీటిని పాకిస్తాన్ పంట పొలాల్లో ఉపయోగించుకోవడం లేదు.

Pages