S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
యాడికి, జూలై 2 : గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరం భాగస్వాములవుదామని ఎమ్మెల్యే జెసి ప్రభాకర్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మండల పరిధిలోని రాయలచెరువులో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభం, ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా స్థానిక బస్టాండ్ సమీపంలోని సులభ్కాంపెక్స్ను ప్రారంభించారు. అనంతరం నగరూరు రహదారిని పరిశీలించారు.
పుట్టపర్తి, జూలై 2: ఆర్టిసి రవాణా కొరియర్ సర్వీసును సద్వినియోగపరుచుకోవాలని పుట్టపర్తి డిపో మేనేజర్ రమణయ్య పిలుపునిచ్చారు. శనివారం పుట్టపర్తి ఆర్టిసి బస్టాండులో ఆర్టిసి కార్గో కొరియర్ సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ అతి తక్కువ ఖ ర్చుతో వినియోగదారులకు వస్తు రవా ణా సదుపాయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
గుంతకల్లు, జూలై 2 : బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేసి ఎటిఎం నెంబర్ చెప్పించుకుని ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసుకున్న ఘటన గుంతకల్లు పట్టణంలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని తిలక్నగర్లో నివాసం ఉంటున్న జి వెంకటనారాయణకు చెందిన బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరస్థుడు విడుతల వారీగా రూ.42323 నగదు డ్రా చేసుకున్నాడు.
బుక్కరాయసముద్రం, జూలై 2: అనంతపురం జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న జగనాథ్(53) అనే ఖైదీ శనివారం తెల్లవారుజామున జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయంపై స్థానిక జిల్లా జైలు సూపరింటెండెంట్ నాగేశ్వర్డ్డిని వివరణ కోరగా వివరాలు ఈ విధంగా వున్నాయి.
అగళి, జూలై 2 : మండలంలోని నరసాంబూదిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనిరుధ్ (22) మృతి చెందాడు. మధూడికి చెందిన అనిరుధ్ పూల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. ఇందులో భాగంగానే నరసాంబూదిలో పూలు కట్టించేందుకు శనివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై వస్తుండగా బస్టాండ్లో మలుపు వద్ద టిప్పర్ ఢీకొంది. దీంతో అనిరుధ్ అక్కడికక్కడే మృతి చెందాడు. టిప్పర్ డ్రైవర్ రోడ్డు పక్కన నిలిపి పరారయ్యాడు.
తాడిపత్రి, జూలై 2: మండల పరిధిలోని బోగసముద్రం (బుగ్గ)గ్రామం సమీమంలో శనివారం హోటల్లోకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో శ్రీనివాసులు(35) అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయలపాలైనారు.
కరీంనగర్, జూలై 3: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరుసగా రెండేళ్లు తీవ్రనష్టాలు చవిచూసిన జిల్లా రైతాంగం ఈ ఖరీఫ్పైనే గంపెడాశలు పెట్టుకుంది. రుతుపవనాలు ప్రవేశించి పక్క జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే, జిల్లాలో మాత్రం ఆశించిన స్థాయిలో లేకుండా నామమాత్రంగానే వర్షం పడుతోంది. అడపదడపా కురుస్తున్న వర్షాలతో పత్తి, మొక్కజొన్న పంటలను రైతులు సాగు చేస్తున్నారు.
గోదావరిఖని, జూలై 3: అభివృద్ధిలో నూతన ఒరవళ్లతో తెలంగాణ రాష్ట్రంలోనే రామగుండం నగర పాలక సంస్థను ఆదర్శ నగరంగా తీర్చిదిద్ధుతామని మేయర్ కొంకటి లక్ష్మీ నారాయణ అన్నారు.
ధర్మపురి, జూలై 3: నిజామాబాద్ - జగ్దల్పూర్ మధ్య 63వ నెంబరు జాతీయ రహదారిలో అంతర్భాగమై, కరీంనగర్ - ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతూ, అర్దశతాబ్ధి కాలానికి పైగా రాకపోకలకు ప్రధాన వారధిగా ఉన్న రాయపట్నం బ్రిడ్జి చాలాకాలంగా ఏటా వస్తున్న గోదావరి వరదలలో మునిగి ఉంటూ, తాత్కాలిక మరమ్మతులు చేసుకుంటూ, ప్రమాదపుటంచున ప్రయాణిస్తున్నది.
కరీంనగర్ టౌన్, జులై 3: ఆదిలాబాద్ జిల్లా ప్రేమ పేరుతో యువతిని చంపిన హంతకున్ని కఠినంగా శిక్షించాలంటూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆద్వర్యంలో ప్రేమోన్మాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు.