బిజినెస్

రూ. 2.35 లక్షల కోట్ల పెట్టుబడులకు హామీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 21: పశ్చిమ బెంగాల్ మూడోసారి నిర్వహించిన రెండు రోజుల బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సదస్సులో వ్యాపార, పారిశ్రామిక రంగాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులకు హామీ లభించింది. 2.35 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. శుక్రవారం ఇక్కడ మొదలైన ఈ సదస్సు శనివారంతో ముగియగా, పెట్టుబడుల వివరాలను రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. తయారీ రంగంలో చైనా 61,765 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టేందుకు ముందుకొచ్చిందని చెప్పారు. కాగా, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇ) రంగం 50,710 కోట్ల రూపాయల పెట్టుబడులను, పట్టణాభివృద్ధి 46,600 కోట్ల రూపాయల పెట్టుబడులు, రవాణా 38,810 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇలా మొత్తం అన్ని రంగాల తరఫున రాష్ట్రంలో 2.35 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సమీప భవిష్యత్తులో పెట్టేందుకు దేశ, విదేశీ వ్యాపార, పారిశ్రామిక సంస్థలు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాయని చెప్పారు. గత రెండు బిజినెస్ సదస్సుల్లో 4.93 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనలు అందుకున్నామని పేర్కొన్నారు. గతంలో పాలించిన వామపక్ష ప్రభుత్వాలు బెంగాల్‌ను వ్యాపారానికి దూరం చేశాయని, అయితే తమ హయాంలో వ్యాపార, పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని మమత ఈ సందర్భంగా తెలిపారు. కాబట్టి బెంగాల్ ఎప్పుడూ మదుపరులను ఆహ్వానిస్తూనే ఉంటుందని, అన్ని వసతులను కల్పిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన సదస్సులో రాబోయే కొనే్నళ్లలో బెంగాల్ ఎఫ్‌ఎమ్‌సిజి రంగంలో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టనున్నట్లు ఆర్‌పి సంజీవ్ గోయెంకా గ్రూప్ చైర్మన్ సంజీవ్ గోయెంకా ప్రకటించినది తెలిసిందే. భారతీ ఎంటర్‌ప్రైజెస్ కూడా వచ్చే 2-3 ఏళ్లలో 3,000-4,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పెడుతున్నట్లు ప్రకటించింది. ఫ్యూచర్ గ్రూప్ సిఇఒ కిశోర్ బియాని, హీరో గ్రూప్ సిఎండి పంకజ్ ముంజల్ సైతం బెంగాల్‌లో తమ భవిష్యత్ వ్యాపార కార్యకలాపాలను వివరించారు.

చిత్రం... శనివారం కోల్‌కతాలో బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సదస్సు ముగింపు సందర్భంగా మాట్లాడుతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ