బిజినెస్

దేశీయ మార్కెట్లలో క్షీణిస్తున్న ఎఫ్‌పిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 5: విదేశీ మదుపరులు దేశీయ స్టాక్ మార్కెట్ల లోకి గత నెలలో 2,500 కోట్ల రూపా యలకుపైగా పెట్టుబడులను తెచ్చారు. ఈ ఏడాది తొలి రెండు నెలల్లో పెట్టుబడుల ఉపసంహరణల ధ్యాస తోనే నడిచిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ).. మలి రెండు నెలల్లో మాత్రం పెట్టుబడుల ప్రవాహా న్ని సృష్టించారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో స్టాక్ మార్కెట్లలోకి 29,559 కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్‌పిఐలు పట్టుకొచ్చారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న అంచనాలు మదుపరులను విపరీతంగా ఆకట్టుకో గా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఏప్రిల్‌లో జరిపి న తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో రేటును ఐదేళ్ల కనిష్టానికి తగ్గిస్తూ 6.5 శాతానికి తీసుకురావడం మార్కెట్ సెంటిమెం ట్‌ను బలపరిచింది. మే నెలలోనూ పెట్టుబడుల దిశగానే మదుపరులు వెళ్లారు. అయతే అంతకుముందు రెండు నెలలతో పోల్చితే దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులపట్ల ఎఫ్‌పిఐలకు ఆసక్తి సన్నగిల్లిందన్న వాస్తవం తెలుస్తోంది. నిజానికి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, మారిష స్‌తో భారత పన్ను ఒప్పందాల సవరణ వంటివి తొలి రెండు వారాల్లో విదేశీ మదుపరుల కొనుగోళ్ల ఆసక్తిని దెబ్బతీశాయ. అయతే తర్వాతి రెండు వారాల్లో తిరిగి పుంజుకున్నాయ. అసోంలో బిజెపి అధికారంలోకి రావడం కూడా కారణమే. అయనప్ప టికీ మే నెలలో 2,543 కోట్ల రూపా యల విదేశీ పెట్టుబడులు మాత్రమే భారత స్టాక్ మార్కెట్లకు వచ్చాయ. మరోవైపు ఇదే సమయంలో రుణ మార్కెట్ల నుంచి 4,409 కోట్ల రూపా యల విలువైన విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ జరగడం గమనార్హం. ఇక ఈ నెల తొలి వారంలోనూ 966 కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్‌పిఐలు దేశీయ మార్కెట్లలోకి తెచ్చారు. కాగా, జనవరి, ఫిబ్రవరిలో 16,647 కోట్ల రూపాయల పెట్టుబడులను స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్‌పిఐలు గుంజేసుకోగా, నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య 41,661 కోట్ల రూపాయలను వెనక్కి తీసుకున్నారు. మరోవైపు ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్లలోకి 16,420 కోట్ల రూపా యల విదేశీ పెట్టుబడులు వచ్చాయ.