బిజినెస్

భారత్‌లో వ్యాపారం కష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: భారత్‌లో వ్యాపార నిర్వహణ కష్టంగా ఉందని ఎయిర్‌ఏషియా సిఇఒ షా ఇమ్రాన్ అహ్మద్ అన్నారు. దేశీయ విధానాలు, స్వార్థ ప్రయోజనాలే ఇందుకు కారణమన్న ఆయన భారత్‌లో తమ వ్యాపారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆదివారం ఇక్కడ పిటిఐతో మాట్లాడుతూ ఎయిర్‌ఏషియా వృద్ధి మందగమనాన్ని సమర్థించుకున్నారు. భారత విమానయాన రంగం ‘డబుల్ మారథాన్’ అని ‘స్ప్రింట్’ కాదని వ్యాఖ్యానించిన ఆయన తమకు స్పష్టమైన పౌరవిమానయాన విధానం ఉందని, ఎలా ముందుకు వెళ్లాలో తెలుసన్నారు. అయనా తామేమి తుపానులా, చైనా ఉత్పత్తుల మాదిరిగా, విజయ్ మాల్యాలా మార్కెట్లలోకి వెళ్లాలనుకోవడం లేదన్నారు.