బిజినెస్

బిఎస్‌ఎన్‌ఎల్ పంద్రాగస్టు ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14: ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తమ ల్యాండ్‌లైన్ వినియోగదారులకు సోమవారం అపరిమితంగా ఉచిత కాల్స్ ఆఫర్‌ను ప్రకటించింది. అలాగే ఈ నెల 21 నుంచి ప్రతి ఆదివారం దేశంలోని ఏ మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ నెంబర్లకైనాసరే ఉచితంగా ఎంతసేపైనా ల్యాండ్‌లైన్ నుంచి మాట్లాడుకోవచ్చని టెలికామ్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం 14.35 మిలియన్ల వినియోగదారులతో దేశీయ ల్యాండ్‌లైన్ మార్కెట్‌లో బిఎస్‌ఎన్‌ఎల్ దాదాపు 57 శాతం వాటాను కలిగి ఉంది. ఇప్పటికే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఉచిత అపరిమిత నైట్ కాల్స్ ఆఫర్‌ను బిఎస్‌ఎన్‌ఎల్ ఇస్తోంది.