బిజినెస్

ఎఫ్‌పిఐలను ఆకట్టుకోని రుణ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహర ణ కొనసాగుతోంది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గత నెల నవంబర్‌లో దాదాపు 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరులు (ఎఫ్‌పిఐ).. ఈ నెలలోనూ అదే దారిలో పయనిస్తు న్నారు. అయతే స్టాక్ మార్కెట్లలోకి స్వల్పంగా పెట్టుబడులను పట్టుకొచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్ల నుంచి మాత్రం 17 వేల కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను లాగేసుకు న్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక, తదనంతర పరిణామాల ప్రభావం కూడా భారత్‌సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లపై కనిపిస్తోంది. యూరోజోన్ సభ్యత్వంపై ఇటలీ రెఫరెండమ్ కూడా మార్కెట్లపై ప్రభావం చూపిస్తోంది. అంతకుముం దు నెల అక్టోబర్‌లో 10,000 కోట్ల రూపాయల కుపైగా పెట్టుబడులను గుంజేసుకున్న ఎఫ్‌పిఐలు.. నవంబర్ ట్రేడింగ్‌లో అటు స్టాక్ మార్కెట్ల నుంచి ఇటు రుణ మార్కెట్ల నుంచి 39,396 కోట్ల రూపాయల (5.78 బిలియన్ డాలర్లు)ను తీసుకున్నారు. స్టాక్ మార్కెట్ల నుంచి 18,244 కోట్ల రూపాయలు, రుణ మార్కెట్ల నుంచి 21,152 కోట్ల రూపాయలు తరలిపోయాయ. నిజానికి సెప్టెంబర్ లో పెట్టుబడులను తీసుకొచ్చిన మదుపరులు.. అక్టోబర్‌లో మాత్రం వెనక్కి తగ్గారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో చూస్తే స్టాక్ మార్కెట్ల నుంచి 22,500 కోట్ల రూపాయలు, రుణ మార్కెట్ల నుంచి 27,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను ఎఫ్‌పిఐలు పట్టుకుపోయారు. ముఖ్యంగా రుణ మార్కెట్ల నుంచి భారీ స్థాయలో పెట్టుబడులను ఎఫ్‌పిఐలు ఉపసంహరించుకుంటు న్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వడ్డీరేట్ల తగ్గింపు దీనికి ప్రధాన కారణమని, బాండ్లకు డిమాండ్ తగ్గడంతో రుణ మార్కెట్లు పడిపోయాయని ఎస్‌ఎఎస్ ఆన్‌లైన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సిద్ధాంత్ జైన్ అన్నారు. దీంతో రుణ మార్కెట్ల నుంచి అక్టోబర్‌లో 6,000 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు పోయాయ. నవంబర్‌లోనూ 21,152 కోట్ల రూపాయల పెట్టుబడులు వెళ్లిపోయాయ. తాజాగా డిసెంబర్ మొదలు ఇప్పటిదాకా 17,392 కోట్ల రూపాయల పెట్టుబడులు రుణ మార్కెట్ల నుంచి వెనక్కిపో యాయ. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్లలోకి మాత్రం 138 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వచ్చాయ. మరోవైపు నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు దేశీయ మార్కెట్లనూ ప్రభావితం చేస్తోంది. అలాగే అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచనుందన్న సంకేతాలూ విదేశీ మదుపరులను భయ కంపితులను చేస్తున్నాయ. అక్టోబర్‌కు ముందు భారతీయ మార్కెట్లలో పెట్టుబడులపట్ల విదేశీ మదుపరులు ఆసక్తినే కనబరిచారు. సెప్టెంబర్‌లో స్టాక్ మార్కెట్లలోకి 10,000 కోట్ల రూపాయ లకుపైగా పెట్టుబడులను తీసుకురావడంతో రుణ, స్టాక్ మార్కెట్లలోకి 20,000 కోట్ల రూపాయలు వచ్చినట్లైంది. గడచిన 11 నెలల్లో ఈ స్థాయలో పెట్టుబడులు రావడం ఇదే ప్రథమం. నిరుడు అక్టోబర్‌లో 22,350 కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా, మళ్లీ ఆ తర్వాత ఈ సెప్టెంబర్‌లోనే ఆ స్థాయలో పెట్టుబడులు వచ్చాయ. పార్లమెంట్‌లో కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఏకగ్రీవంగా ఆమోదం పొందడం, ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్- జూన్)గాను వివిధ సంస్థలు ప్రకటించిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగుం డటం వంటివి దేశీయ స్టాక్, రుణ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులను అమితంగా రప్పించాయ. అంతకుముందు రెండు నెలల్లోనూ విదేశీ పెట్టుబడులు భారతీయ మార్కెట్లలోకి భారీగానే వచ్చాయ. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో కరెంట్ ఖాతా లోటు జిడిపిలో 0.1 శాతానికి తగ్గడం, వాహన అమ్మకాలు కూడా ఆశాజనకంగా నమోదు కావడం వంటివి కలిసొచ్చాయ. కాగా, ఈ ఏడాది జనవరి-జూన్‌లో స్టాక్ మార్కెట్లలోకి 20,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తెచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్ల నుంచి 12,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను లాగేసుకున్నారు. మరోవైపు ఈ సంవత్సరం మొదలు ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్లలోకి 28,881 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకొచ్చిన విదేశీ మదుపరులు.. రుణ మార్కెట్ల నుంచి 42,101 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకున్నారు.