బిజినెస్

మరింత చౌకగా గృహ, కార్పొరేట్ రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. ఆదివారం ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)తోపాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యుబిఐ)లు బేస్ రేటును 0.90 శాతం వరకు తగ్గించగా, సోమవారం ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐతోపాటు మరో రెండు ప్రైవేట్ బ్యాంకులైన కొటక్ మహీంద్ర, బంధన్ బ్యాంకులూ వడ్డీరేట్లను దించాయి. ప్రభుత్వరంగ బ్యాంకులైన దేనా బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కూడా బేస్ రేట్లను తగ్గించాయి. దీంతో గృహ, కార్పొరేట్ రుణాలు మరింత చౌక అయ్యాయి. ఐసిఐసిఐ బ్యాంక్ తమ బేస్ రేటును 0.70 శాతం తగ్గించగా, దేనా బ్యాంక్ 0.75 శాతం తగ్గించింది. కొటక్ మహీంద్ర 0.45 శాతం మేర దించితే, కొత్తగా వచ్చిన బంధన్ బ్యాంక్ ఏకంగా 1.48 శాతం తగ్గించడం గమనార్హం. ఆదివారం ఎస్‌బిఐ తమ బేస్ రేటును 0.90 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించగా, పిఎన్‌బి 0.70 శాతం, యుబిఐ 0.65 శాతం నుంచి 0.90 శాతం మేర తమ బేస్ రేటును తగ్గించాయి. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. గృహ, కార్పొరేట్ రుణాలకు చేయూతనిస్తూ రాయితీలను ప్రకటించినది తెలిసిందే. దీంతో బ్యాంకులు తామిచ్చే రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. బ్యాంకులు తీసుకుంటున్న ఈ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని, వినియోగ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని పరిశ్రమ ఆనందం వ్యక్తం చేస్తోంది. సిఐఐ, ఫిక్కీలు హర్షం వెలిబుచ్చాయి. పాత పెద్ద నోట్ల రద్దుతో పడిపోయన వ్యాపార, పారిశ్రామిక లావాదేవీలు పుంజుకుంటాయని, మళ్లీ పరిశ్రమకు నిధులు సమకూరుతాయని పేర్కొన్నా య. మరిన్ని బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను తగ్గించాలన్నాయ.