బిజినెస్

మిధాని డివిడెండ్ రూ. 35.41 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: హైదరాబాద్ ఆధారిత మినీ రత్న కేటగిరి 1 రక్షణ సంస్థ మిధాని.. గత ఆర్థిక సంవత్సరానికి (2015-16)గాను 35.41 కోట్ల రూపాయల డివిడెండ్‌ను ప్రకటించింది. 2015-16లో పన్నుల అనంతర లాభం 118.03 కోట్ల రూపాయలుగా నమోదవగా, ఇందులో 30 శాతాన్ని ఇప్పుడు డివిడెండ్‌గా ఇస్తోంది మిధాని. ఈ డివిడెండ్ చెక్కును రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌కు సంస్థ డైరెక్టర్లతో కలిసి ఈ నెల 25న మిధాని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డికె లిఖి అందించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో మిధాని తెలిపింది. కాగా, పూర్తి డివిడెండ్‌ను సంస్థ ప్రకటించడం వరుసగా ఇది ఐదో ఏడాది. అలాగే డివిడెండ్ చెల్లింపులు ఇది వరుసగా 13వసారి.